నీ అల్లుడు ఆంధ్ర కాదా.. రేవంత్ రెడ్డిపై షర్మిల ఫైర్

by Disha Web Desk 4 |
నీ అల్లుడు ఆంధ్ర కాదా.. రేవంత్ రెడ్డిపై షర్మిల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తన వల్ల ఎక్కడ ఉనికి పోతుందో అని అభద్రత భావంతో రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నాడని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నాది ఆంధ్ర అని రేవంత్ రెడ్డి అంటున్నాడని తాను ఆంధ్రకు చెందిన వ్యక్తినే అయితే సోనియా గాంధీ ఎక్కడి వారని ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. సోనియా గాంధీ ఇటలికి చెందిన వ్యక్తి కాదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌టీపీ అని జై తెలంగాణ అనే హక్కు రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోడీ, సోనియాకు లేదన్నారు.

రేవంత్ రెడ్డి అల్లుడు కూడా ఆంధ్రా అని ఆ సంగతి ఆయన తెలుసుకోవాలన్నారు. దళితబంధు పథకంలో ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నిస్తే ప్రగతి భవన్ లోని కమీషన్ల డొంక కదులుతుందనే భయంతోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకోవడం లేదని ఆరోపించారు. దళితబంధులో సొంత పార్టీ ఎమ్మెల్యేలే స్వహా చేశారని స్వయంగా సీఎం కేసీఆరే అంగీకరించారన్నారు. ఎమ్మెల్యేల అవినీతిపై ప్రశ్నిస్తే వారు తిరిగి తన అవినీతిని ప్రశ్నిస్తారనే భయం కేసీఆర్ కు ఉందేమో అని ఎద్దేవా చేశారు. ఇంతటి అవినీతి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story

Most Viewed